అప్పుడు కరోనా.. ఇప్పుడు వరదలు..!ఈ పాపమూ వాడిదే..!

0
1000120897
Share

చైనా వాడు వస్తువులే కాదు.. ఏదైనా చీప్ గా ఈచేస్తాడు.కరోనాను ప్రపంచానికి అంటించి జనం ఉసురు తీశాడు.. పెద్దన్న నిధులు ఇస్తే..చైనా చిన్నోడు వైరస్ పై ప్రయోగాలు చేసి.. ల్యాబ్ నుంచి వదిలేశారు..తర్వాత బయటపడినా మాకేం తెలియదు అంటూ నకరాలు చేశారు. ఇప్పుడు వరదలు విషయంలో అంతే..ముందే తెలిసినా నేపాల్ ను హెచ్చరించ లేదు.ఎంత నీచమైన బుద్ధి ఆ దేశానిది అర్థమవుతుంది.ఒక్క మాట ముందే చెబితే వందల ప్రాణాలు పోయేవి కాదు.సమాచార మార్పిడి ఒప్పందం లేదని కాకమ్మ కబుర్లు చెబుతుంది సిగ్గులేకుండా డ్రాగన్ కంట్రీ.

సీనియర్ జర్నలిస్ట్ శ్రీని మాటల్లో…

చైనా వివాదాస్పద నిర్మాణాల వల్లే నేపాల్‌లో త్రిశూలి నది ఉప్పొంగి పెను విపత్తు సంభవించిందనే ఆరోపణలపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది.
నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో చైనా చేపట్టిన విచక్షణారహిత నిర్మాణాలే ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు ప్రధాన కారణమని స్థానిక జర్నలిస్టుల బృందం, పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.

ప్రధాన వివాదం మరియు నది మళ్లింపుప్రవాహ మార్గం మార్పిడి:
త్రిశూలి నది ప్రవాహాన్ని, రెండు నదులు కలిసే సంగమ ప్రాంతాన్ని చైనా తమ ఇష్టానుసారంగా మళ్లించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. జిరోంగ్ పోర్ట్ (Gyirong Port), అఫీస్ మౌలిక సదుపాయాల కోసం కొండలను తొలిచి నది సహజ రూపాన్ని మార్చేశారు.

భారీ నష్టం:
ఈ మార్పుల వల్ల నదీ ప్రవాహ తీవ్రత పెరిగి, సుమారు $647 మిలియన్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక అప్పర్ త్రిశూలి-1 హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌తో పాటు 11 ఇతర జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎగువ డ్యామ్, బేస్ క్యాంప్ దాదాపు 90% కొట్టుకుపోయాయి.

చైనా వివరణ:
అయితే ఈ ఆరోపణలను చైనా ఎంబసీ ఖండించింది. నేపాల్ వైపు హిమానీనదం (Glacier) కుప్పకూలడం వల్లే ఈ వరదలు వచ్చాయని, తమ నిర్మాణాల వల్ల కాదని చైనా సమర్థించుకుంటోంది.

పర్యావరణ విధ్వంసంపై ద్వంద్వ విధానాలు:
యాంగ్జీ నదిపై త్రీ గోర్జెస్ డ్యామ్ నిర్మించి లక్షలాది మందిని నిర్వాసితులను చేసినప్పుడు గానీ, బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌లు కడుతున్నప్పుడు గానీ చైనా తన అద్భుత ఇంజనీరింగ్ power కీర్తించుకుందే తప్ప, అక్కడ జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని (Ecological Damage) ఎవరూ ప్రశ్నించలేకపోయారు.కానీ, ఇదే భారతదేశంలోని కరవు పీడిత ప్రాంతాలైన కచ్ (Kutch) మరియు సౌరాష్ట్ర (Saurashtra) ప్రాంతాల సాగునీరు, తాగునీటి అవసరాల కోసం నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ కడుతుంటే, ఇక్కడ కొందరు ‘నర్మదా బచావో ఆందోళన’ పేరుతో పెద్ద ఎత్తున రచ్చ చేశారు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దుల్లోని గిరిజన గ్రామాల ముంపు, పునరావాస సమస్యలను తెరపైకి తెచ్చి ప్రపంచ బ్యాంక్ నిధులు సైతం నిలిచిపోయేలా చేశారు.
చైనా లాంటి దేశాలు సరిహద్దుల్లో పర్యావరణాన్ని నాశనం చేస్తూ నదుల గమనాన్ని మారుస్తున్నా ఎవరూ అడ్డుకోలేకపోతుంటే, భారతదేశంలో ప్రజాప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్టులపైనే ఇలాంటి వివాదాలు సృష్టించబడ్డాయనే ఆవేదన ఈ త్రిశూలి నది ఘటనతో మరోసారి స్పష్టమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *