తిరుమల శ్రీవారి దర్శనం కోటా టికెట్స్ ఈజీగా ఇలా…

0
Share


తిరుమల టికెట్స్ నవంబర్ కోటా ఈ నెల 18 నుంచి విడుదల చేస్తున్నారు. తొలుత సేవల టికెట్స్ రిలీజ్ చేస్తారు.వీటిని చాలా మంది లైట్ తీసుకుంటారు.ఎందుకంటే రేట్లు ఎక్కువగా ఉంటాయి అని వదిలేస్తారు. కానీ ఇవే ఈజీ.ఆన్లైన్ లో బుక్ చేస్తే దొరుకుతాయి. ఆర్జిత సేవలు టికెట్ 500 ఉంటుంది. ఇద్దరికి ఇద్దరికి 1000 రూపాయలు.పిల్లలు ఉంటే మరో 500 petti తీసుకోవాలి. ఇలా టికెట్ తీసుకుంటే వైభవోత్సవ మండపంలో 2.30కి సేవ ఉంటుంది.. తర్వాత గంటలో దర్శనం అవుతుంది.సుపథo ద్వారా వెళ్లాలి.గంట లేదంటే అదే గంటన్నర లో స్వామీ వారి దర్శనం కలుగుతుంది… ఇక్కడ 300 టికెట్స్ తో పోలిస్తే చాలా బెటర్.ఆర్జిత bramostvam, కళ్యాణం మే కాదు..ఏదైనా ఇంతే..పూర్తి వివరాలు ttd official website లేదా app లో చెక్ చేయండి. రూమ్స్ అదే రోజు 3 గంటలకు బుక్ చేసువాలి.100 రూపాయలు రూమ్ గుడికి దగ్గరలో ఉంటది.500,1000 రూపాయలు రూంలు ఐతే కొండకి దూరంగా లేదా కొండ కింద దొరుకుతాయి.పేమెంట్ చేయడంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి.లేదంటే పైన రూమ్స్ త్వరగా అయిపోతాయి.లేదంటే కిందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.కింద కూడా బెటర్.కానీ ఒక్కసారి కిందకు దిగమంటే మళ్లీ వెళ్ళాలి అనిపించదు.కింద ఐతే కాణిపాకం,శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *