ఆర్మీ లో కూడా ఇలా తయారయ్యేంట్రా..! అదీ అమ్రాబాద్ మల్లేష్.. జిల్లా పరువు తీశావ్..
డీజీపీ ఆనంద్ సార్..ఒక్కసారి ఈ కోణంలోనూ ఎంక్వైరీ చేయండి
ఆర్మీ అంటే జాతీయ జెండాకు ఎంత గౌరవం ఇస్తారో అంతే రెస్పెక్ ఉంటుంది. సైనికులు అంటే దేశం సలాం చేస్తుంది.. బోర్డర్ లో గడ్డ కట్టే చలికి తట్టుకుంటూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటే..మనం ఇక్కడ హాయిగా నిద్రపోతాం. కానీ ఆర్మీలో ఎప్పుడూ చూడని ఓ ఘటన వెలుగులోకి రావడం జనాన్ని కలిచివేస్తుంది.ప్రతి క్షణం దేశం కోసం కొట్టుకొనే ఆ గుండెలు..ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాయి.ఇద్దరు హవల్దారులు ..ఆర్మీ ఆయుధాలు చోరీ చేయడం విస్మయ పరుస్తోంది.అది కూడా నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన రాజు అలియాస్ మల్లేష్ చేయడం విచారకరమ్. ఏకే 47 లు దొంగిలించి అమ్రాబాద్ లో గుంత తీసి దాయడం దారుణం. అసలు ఎవడీడు.. జిల్లాలో చెడబుట్టాడు.. అయినా ఆర్మీలో ఉండి ఇదేం పాడు బుద్ధి రా బాబు.కొంచమైనా సిగ్గు ఉండాలి.మాయావి మల్లేష్..నీ పెళ్ళానికి ఉన్నా సోయి కూడా నీకు లేదా.?దేశానికి ద్రోహం చేస్తున్నామనే మతి లేదా, అయినా ఆ ఆయుధాలు ఎత్తుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నావు..గతంలో నక్సలైట్ గా పనిచేసినా అనుభవం ఉందా ఏంటి.. ఎంతైనా అమ్రాబాద్ కదా.. అనుమానం వస్తుంది.. డీజీపీ ఆనంద్ సార్..ఒక్కసారి ఈ కోణంలోనూ ఎంక్వైరీ చేయండి… అసలు ఏం జరిగింది అంటే…
బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో జరిగిన సంచలనాత్మక ఆయుధాల దోపిడీ కేసును తెలంగాణ రాష్ట్ర పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
కేసు సున్నితత్వం దృష్ట్యా, మేము స్టేట్ ఇంటెలిజెన్స్, హెచ్సిపి టాస్క్ ఫోర్స్ మరియు మల్కాజ్గిరి ఎస్ఓటి నుండి మా అత్యుత్తమ బృందాలను, షో మోర్తో సన్నిహిత సమన్వయంతో మోహరించాము.

